కొత్త ప్రధాన అర్చకుడి చేతుల మీదుగా తెరచుకున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు
తిరువనంతపురం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని శబరిమల దేవస్థానానికి కొత్త ప్రధాన అర్చకుడిగా ఎంపికైన ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి బాధ్యతలను స్వీకరించారు. ఆయన చేతుల మీదుగా ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ తెల్లవారు జామున 4 గంటలకు వృశ్చిక లగ్నంలో సంప్రదాయబద్ధంగా మణికంఠుడికి పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ తలుపులను పరమేశ్వర్ నంబూద్రి తెరిచారు. అనంతరం అయ్యప్పుడి భక్తులకు సన్నిధానంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు.
source https://telugu.oneindia.com/news/india/new-head-priest-n-parameswaran-namboothiri-opened-the-doors-of-aabarimala-ayyappa-temple-306221.html
source https://telugu.oneindia.com/news/india/new-head-priest-n-parameswaran-namboothiri-opened-the-doors-of-aabarimala-ayyappa-temple-306221.html
Comments
Post a Comment